పింఛన్ల పంపిణీలో ఏదైనా సమస్య వస్తే టోల్ ఫ్రీ నెంబర్ 6300433367కు కాల్ చేయాలని చిత్తూరు కలెక్టర్ షన్మోహన్ బుధవారం కోరారు. తన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. నేటి నుంచి సచివాలయాల్లో పింఛన్ నగదు పంపిణీ చేస్తామన్నారు. నడవలేని వికలాంగులు, వృద్ధులను గుర్తించి వాళ్ల ఇంటి వద్దే పింఛన్ అందజేస్తామని ఆయన తెలిపారు. వారం రోజుల్లో నగదు పంపిణీ పూర్తి చేస్తామని. కాస్త సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేశారు.