షెడ్యూల్ ప్రకారం స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాలు: కమిషనర్

81చూసినవారు
షెడ్యూల్ ప్రకారం స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాలు: కమిషనర్
చిత్తూరు నగరపాలక సంస్థ పరిధిలో స్వచ్ఛతా హీ సేవా -2024 కార్యక్రమాలను నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం చేపట్టాలని నగర కమిషనర్ పి. నరసింహ ప్రసాద్ చెప్పారు. స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా గురువారం ఉదయం మిట్టూరులోని ఆలయం వద్ద శుభ్రతా పనులు చేపట్టారు. ఈ సందర్భంగా విద్యార్థులు, స్థానికులతో "స్వచ్ఛత ప్రతిజ్ఞ" చేయించి.. స్వచ్ఛతాహీ సేవ కార్యక్రమాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎంహెచ్వో డా. అనిల్ కుమార్ నాయక్, శానిటరీ ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్