నేను బడికి పోతా కార్యక్రమం

61చూసినవారు
నేను బడికి పోతా కార్యక్రమం
కార్వేటినగరం మండలంలోని పాఠశాలలను గురువారం డీఈఓ దేవరాజులు సందర్శించారు. 'నేను బడికి పోతా' అనే కార్యక్రమంలో భాగంగా మండలంలోని ఎంఈఓలు విజయ్ కుమార్, మనోజ్ కుమార్, హెచ్ఎంలతో డీఈఓ దేవరాజులు ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. 6 - 14సం. వయసు మధ్య ఉన్న బడి ఈడు పిల్లల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ బడి బయట లేకుండా బడిలో చేర్పించాలని ఆదేశించారు. విద్యలో వెనుకబడిన వారిని దత్తత తీసుకుని విద్యాభివృద్ధి అందించాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్