జగన్ను రాష్ట్ర ప్రజలు గద్దె దించాలని బలంగా అనుకున్నారని, అందుకే వైసీపీ ఘోర పరాజయం చవిచూసిందని కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తెలిపారు. ఈ ఎన్నికలు రాష్ట్ర చరిత్రలోనే విచిత్రమైనవని అభివర్ణించారు. కాంగ్రెస్ పార్టీ ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకోగలిగిందని చెప్పారు. 2029 ఎన్నికల్లో కాంగ్రెస్ కీలకపాత్ర పోషిస్తుందనే నమ్మకం ఉందన్నారు.