ఢిల్లీ లిక్కర్ స్కామ్కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు రౌస్ అవెన్యూ కోర్టు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన తీహార్ జైలు నుంచి రేపు విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ట్రయల్ కోర్టు వెకేషన్ బెంచ్ జడ్జ్ నియామ్ బిందు రూ.లక్ష పూచీకత్తుతో ఈ బెయిల్ని మంజూరు చేశారు. దీంతో ఆమ్ ఆద్మీ పార్టీ క్యాంప్లో సంబరాలు మిన్నంటాయి.