విజయవాడలో జరిగిన వైసీపీ విస్తృత స్థాయి సమావేశాలలో గంగాధర నెల్లూరు నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్త కృపాలక్ష్మి గురువారం పాల్గొన్నారు. ఆమె మాట్లాడుతూ, తమ అధినేత జగన్మోహన్ రెడ్డి పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటూ ప్రభుత్వ వైఫల్యాలపై నిలదీయాలని స్పష్టం చేసినట్లు తెలిపారు.