బంధువుల శుభకార్యానికి వచ్చి సరదాగా చెక్ డ్యాంలో స్నానం చేసేందుకు వెళ్ళి ప్రమాదవశాత్తూ నీటిలో మునిగి యువకుడు మృతి చెందిన సంఘటన కుప్పం మండలంలోని కంగుంది సమీప పాలారు చెక్ డ్యాంలో సోమవారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం మేరకు కర్ణాటక రాష్ట్రం బెంగళూరులోని నందిని లేఅవుట్ కు చెందిన మౌనిష్ తల్లితో కలిసి శనివారం సాయంత్రం కుప్పం మండలం గుట్టపల్లెకాలనీకి వచ్చారు.