పుత్తూరు పట్టణంలో చిన్న పిల్లలు సరదాగా ఆడుకోవడం కోసం చింతలగుంట చిల్డ్రన్స్ పార్క్ నందు మున్సిపాలిటీ జనరల్ నిధులు అక్షరాల రూ. 24. 00 లక్షల రూపాయలతో నిర్మించనున్న కాంపౌండ్ వాల్ నిర్మాణానికి మంత్రి రోజా శనివారం భూమి పూజ చేశారు. ఆమె మాట్లాడుతూ పుత్తూరులో ఇప్పటికే ఒక పెద్ద పార్క్ ను ప్రారంభించగా, అలాగే వడమాలపేటలో పద్మావతి ఉద్యానవనం కూడా ప్రారంభించామని, త్వరలో ఈ పార్క్ కంప్లీట్ చేస్తామని తెలిపారు.