గంగవరం మండలంలోని బాలేపల్లికి చెందిన పలువురు వైసీపీకి చెందిన వారు ఆదివారం టిడిపిలోకి చేరారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రాబోయే ఎన్నికల్లో నియోజకవర్గంలో తనను ఎమ్మెల్యేగా గెలిపించాలని ఆయన కోరారు. తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే పలమనేరు నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి నేతలు తదితరులు పాల్గొన్నారు.