తవణంపల్లె మండలం కాణిపాకం పట్నం ద్రౌపతి సమేత ధర్మరాజుల ఆలయంలో మహాభారత యజ్ఞాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా కీచక వద ఘట్టాన్ని ప్రదర్శించారు. కళాకారులు అద్భుతమైన ప్రదర్శనతో ఆహుతులను అలరించారు. ఆలయ ధర్మకర్తలు భక్తవత్సల్ రెడ్డి, కృష్ణమూర్తి రెడ్డి, తులసి రెడ్డిలు మాట్లాడుతూ. మే 26వ తేదీ నుంచి మహాభారత యజ్ఞం ప్రారంభమైందన్నారు.