యాదమరి మండలంలో సాక్షాత్తు ఇంద్రుడు ప్రతిష్ఠించిన వరదరాజుల స్వామి ఆలయంలో వైభవంగా బ్రహ్మోత్సవాలు ప్రారంభమైంది. శనివారం అభిషేకం, అలంకరణ, పుష్ప కైకర్యం, గంట హారతి, మాడవీధుల్లో గ్రామోత్సవం నిర్వహించారు. రాత్రి హంస వాహనంపై భూదేవి శ్రీదేవి సమేత వరదరాజుల స్వామి భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తారని అర్చకులు తెలిపారు.