పూతలపట్టు ఎమ్మెల్యే డాక్టర్ కలికిరి మురళిమోహన్ ను శుక్రవారం కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయ ఈవో వెంకటేశు మర్యాదపూర్వకంగా కలిసారు. చిత్తూరులోని ఆయన నివాసం వద్ద కాణిపాక ఆలయ వేద పండితులు చేత ఆశీర్వాదం అందించారు. అనంతరం స్వామివారి శేషవస్త్రంతో సత్కరించారు. స్వామివారి చిత్రపటాన్ని బహూకరించారు.