పట్టణంలో సంబరాలు చేసుకున్న న్యాయవాదులు

73చూసినవారు
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రద్దు చేయడంతో శుక్రవారం పుంగనూరు పట్టణంలో న్యాయవాదులు సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి వారు హర్షం వ్యక్తం చేశారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ లో రైతులకు, ప్రజలకు తీవ్ర అన్యాయం జరిగే అంశాలు ఉన్నాయని అన్నారు. అనంతరం పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్