పట్టణంలో ఘనంగా రెవెన్యూ దినోత్సవం

63చూసినవారు
పట్టణంలో ఘనంగా రెవెన్యూ దినోత్సవం
చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణంలోని తహసిల్దార్ కార్యాలయంలో రెవెన్యూ దినోత్సవాన్ని గురువారం ఎమ్మార్వో శివయ్య ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా రెవెన్యూ ఉద్యోగులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. విశ్రాంత తహశీల్దార్ రెడ్డెప్పరాజు, వాలీశ్వరశర్మ తదితరులను సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మార్వో మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన రెవెన్యూ సేవలు అందించేందుకు కృషి చేస్తున్నట్టు చెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్