పెన్షన్ కోసం వేచివున్న వృద్ధుడు మృతి

1539చూసినవారు
తిరుపతి జిల్లా ఎర్రావారిపాలెం మండలంలోని నెరబైలు సచివాలయం దగ్గర పింఛను తీసుకోవడానికి వేచి ఉన్న వృద్ధుడు షేక్ అసం సాహెబ్ బుధవారం మధ్యాహ్నం కళ్లు తిరిగి పడిపోవడంతో స్థానికంగా ఉన్న ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. మార్గమధ్యంలో చనిపోయినట్లు డాక్టర్లు తెలిపారని స్థానికులు చెప్పారు. ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. బుధవారం మధ్యాహ్నం నుంచి పెన్షన్ పంపిణీ ప్రారంభమైన విషయం తెలిసిందే.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్