పవిత్రమైన శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి వినియోగించే నెయ్యిలో జంతువుల కొవ్వు కలవడంపై సమగ్ర విచారణ చేయాలని విశ్వ హిందూ పరిషత్ కేంద్రీయ మార్గదర్శక మండలి సభ్యులు డిమాండ్ చేశారు. చంద్రగిరి మండలం శ్రీనివాసమంగాపురంలోని శ్రీలలితాపీఠం శ్రీవశిష్టాశ్రమంలో సోమవారం ఉమ్మడి తెలుగు రాష్ట్రాలకు చెందిన విశ్వహిందూ పరిషత్, భాగ్యనగర క్షేత్రం కేంద్రీయ మార్గదర్శక మండలి సమావేశం నిర్వహించారు.