అమ్మవారి సేవలో ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి

69చూసినవారు
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. ఎస్. జవహార్ రెడ్డి శనివారం దర్శించుకున్నారు. వారికి ఆలయం వద్ద టీటీడీ జెఈఓ వీరబ్రహ్మం, విజిఓ బాలిరెడ్డి, డిప్యూటీ ఈవో గోవింద రాజన్, ఆగమ సలహాదారులు శ్రీనివాసాచార్యులు, అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అమ్మవారి కుంకుమార్చన సేవలో పాల్గొన్న వారికి ఆలయాధికారులు అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.

సంబంధిత పోస్ట్