బంగారు తిరుచ్చి పై పద్మావతి దేవి విహారం

54చూసినవారు
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారు శుక్రవారం సాయంత్రం బంగారు తిరుచ్చి పై నాలుగు మాఢ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు కనువిందు చేశారు. ఇందులో భాగంగా అమ్మవారిని వేకువజామున సుప్రభాతంతో మేలుకొలిపి, నిత్య కైంకర్యాలు, అభిషేకం నిర్వహించారు. సాయంత్రం అమ్మవారిని సర్వాంగ సుందరంగా అలంకరించి ఉంజల్ సేవ నిర్వహించారు. అనంతరం విశేషాలంకరణలో విరాజిల్లుతున్న అమ్మవారు తిరుచ్చి పై తిరువీధుల్లో విహరిస్తూ భక్తులకు అభయమిచ్చారు.

సంబంధిత పోస్ట్