రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

55చూసినవారు
చిత్తూరు జిల్లా పలమనేరు మండల పరిధిలోని మొగిలి ఘాట్ వద్ద శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీని కారు ఢీకొట్టడంతో అక్కడికక్కడే ఓ మహిళ మృతి చెందింది. మరో వ్యక్తికి తీవ్ర గాయాలు అయినట్లు సమాచారం. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్