రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

2972చూసినవారు
రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి
చిత్తూరు జిల్లా కేంద్రంలో ఆదివారం జరిగిన ప్రమాదంలో ఓ యువకుడు చనిపోయాడు. చిత్తూరు నగరంలోని మార్కెట్ చౌక్ వద్ద ఉంటున్న పవన్ తన స్నేహితుడితో కలిసి పలమనేరు వైపు నుంచి ఇంటికి బయల్దేరాడు. ఇరువారం జంక్షన్ వద్ద ఎదురుగా బస్సు రావడంతో సడన్ బ్రేక్ వేశాడు. అదుపు తప్పి కిందపడటంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. పవన్ అక్కడికక్కడే మృతిచెందాడు. మరొకరిని చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్