వర్షాలు నేపథ్యంలో అప్రమత్తంగా ఉండండి: కమిషనర్

71చూసినవారు
వర్షాలు నేపథ్యంలో అప్రమత్తంగా ఉండండి: కమిషనర్
వర్షాలు నేపథ్యంలో నగరపాలక ప్రజారోగ్య విభాగం, ఇంజనీరింగ్ విభాగం అధికారులు అప్రమత్తంగా ఉండాలని, వర్షపు నీరు నిల్వచేరకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని నగర కమిషనర్ పి. నరసింహ ప్రసాద్ అధికారులను ఆదేశించారు. శనివారం కమిషనర్ నగరంలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. ఎమ్మెస్సార్ కూడలిలో డ్రైనేజీలను పరిశీలించారు. వ్యర్ధాలు లేకుండా ఎప్పటికప్పుడు తొలగించాలని, నీటి ప్రవాహానికి అడ్డం లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్