ఆటో ఢీకొని ద్విచక్ర వాహనదానికి తీవ్ర గాయాలైన ఘటన చిత్తూరులో సోమవారం చోటుచేసుకుంది. చిత్తూరు నగరంలోని గిరింపేటకు వెళ్లే రహదారి తపోవనం ఎదురుగా ఉన్న విశాల్ మార్ట్ వద్ద కుమరేషన్ అనే వ్యక్తి బైక్ లో ప్రశాంత్ నగర్ కు వెళ్తూండగా వెనక నుంచి ఆటో ఢీకొనడంతో కిందపడి తీవ్ర గాయాలయ్యాయి. 108 ద్వారా చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.