అక్టోబర్ 2న మాంసం విక్రయాలు చేయరాదు: కమిషనర్

58చూసినవారు
అక్టోబర్ 2న మాంసం విక్రయాలు చేయరాదు: కమిషనర్
మహాత్మా గాంధీ జన్మదినం సందర్భంగా అక్టోబర్ 2వ తేదీన (బుధవారం) నగరపాలక సంస్థ పరిధిలో ఎక్కడా మాంసం దుకాణాలు తెరవరాదని‌, విక్రయాలు జరపరాదని నగర కమిషనర్ పి. నరసింహ ప్రసాద్ మంగళవారం తెలిపారు. నిబంధనలు మీరి నడుచుకునే వారి దుకాణాలకు సంబంధించి ట్రేడ్ లైసెన్సులు రద్దు చేయడంతో పాటు, సీజ్ చేస్తామని హెచ్చరించారు. నగర కమిషనర్ ఆదేశాల మేరకు ప్రజారోగ్య విభాగం అధికారులు నగరంలోని మాంసం విక్రయదారులు, హోటళ్ల యజమానులకు నోటీసులు జారీ చేశారు.

సంబంధిత పోస్ట్