కారు ఢీకొని వ్యక్తి దుర్మరణం

32210చూసినవారు
కారు ఢీకొని వ్యక్తి దుర్మరణం
కారు ఢీకొని ఓ వ్యక్తి దుర్మరణం చెందిన సంఘటన బుధవారం గూడూరు మండలం తిరువెంగళాయపల్లి వద్ద చోటుచేసుకుంది. రూరల్ ఎస్ఐ మనోజ్ కుమార్ కథనం మేరకు బాలాయపల్లి మండలం నిండలి గ్రామ వాసి పాలెపు వెంకటాద్రి (28) గూడూరు నుండి బైక్ పై నిండలికి వెళుతుండగా తిరువెంగలయపల్లి వద్ద వెంకటగిరి నుండి వస్తున్న కారు బైక్ ని ఢీ కొట్టింది. మృతుడు అక్కడికక్కడే మరణించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్