74 కేజీల కేక్ కోసి శుభాకాంక్షలు తెలిపిన భువనేశ్వరి

1546చూసినవారు
టీడీపీ అధినేత చంద్రబాబు జన్మదినం సందర్భంగా కుప్పం మున్సిపాలిటీలోని కదిరి నరసింహస్వామి ఆలయంలో నారా భువనేశ్వరి శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. చంద్రబాబు ఆరోగ్యంగా ఉండాలని అర్చకులు దీవించారు. అనంతరం 74 కేజీల కేక్ కోసి చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలియచేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, రాజ్ కుమార్, టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్