పంటలపై ఏనుగులు దాడి

2862చూసినవారు
రామకుప్పం మండలం ముద్దనపల్లి, బిరుగుండ్లపల్లి గ్రామాల సరిహద్దుల్లో మంగళవారం రాత్రి పంటపొలాలపై మూడు ఏనుగులు దాడులు చేశాయి. ప్రధానంగా టమోటా పంటను ధ్వంసం చేసినట్లు రైతులు పేర్కొన్నారు. మండల పరిదిలోని అటవీ సమీప గ్రామాలలో తరుచూ ఏనుగులు పంటపొలాలపై దాడులు చేస్తున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ఫారెస్ట్ అధికారులు స్పందించి ఏనుగులు పంటపొలాలపై దాడులు చేయకుండా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్