క్యాన్సర్ బాధితుల సహాయార్థం మదనపల్లెకు చెందిన చంద్రశేఖర్ రెడ్డి కుమార్తె జోషిత తన కేశాలను మంగళవారం దానం చేశారు. మదనపల్లె పట్టణంలోని హెల్సింగ్ మైండ్స్ ఆఫీసుకు వెళ్లి తన కేశాలను సంస్థ సభ్యులకు అందజేశారు. జోషిత దాతృత్వాన్ని అభినందిస్తూ ఆమెకు ప్రశంసాపత్రం, పూలమొక్క బహూకరించారు. క్యాన్సర్ బాధితుల కోసం ఇప్పటి వరకు 51మంది తమ కేశాలను దానం చేసినట్టు ఆ సంస్థ వ్యవస్థాపకుడు అబూబకర్ తెలిపారు.