రామసముద్రంలో ఎరువుల దుకాణాల తనిఖీ

55చూసినవారు
రామసముద్రంలో ఎరువుల దుకాణాల తనిఖీ
రామసముద్రంలో మదనపల్లి వ్యవసాయ శాఖ ఏడీఏ శివశంకర్ బుధవారం ఎరువు దుకాణాలను పరిశీలించారు. స్టాక్ రికార్డులను పరిశీలించి దుకాణాల ముందు ధరల పట్టికను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. యూరియాను అధిక ధరలకు విక్రయిస్తే లైసెన్స్ రద్దు చేస్తామని దుకాణదారును హెచ్చరించారు. దుకాణాల్లో, రైతు సేవా కేంద్రాల్లో యూరియా అందుబాటులో ఉందని రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఆయన వెంట ఏఓ మోహన్ కుమార్ ఉన్నారు.

సంబంధిత పోస్ట్