అవ్వాతాతల నరకయాత మనసును ద్రవింపజేస్తోంది: రోజా

59చూసినవారు
చంద్రబాబు పన్నాగంతో పెన్షన్ల కోసం రాష్ట్రవ్యాప్తంగా అవ్వాతాతలు పడే నరకయాతన మనసును ద్రవింపజేస్తోందని మంత్రి ఆర్కే రోజా అన్నారు. గురువారం ఆమె నగరిలో మాట్లాడారు. 58నెలలు లేని కష్టాలు నేడు అవ్వాతాతలు, దివ్యాంగులు పడాల్సి వస్తోందన్నారు. ఉదయం ఐదు గంటలకే పెన్షన్ ఇంటికే వెళ్లి ఇప్పించే జగనన్నను చూసి అవ్వతాతలు నా బిడ్డ బాగుండాలని ఆశీర్వదించడాన్ని చంద్రబాబు జీర్ణించుకోలేక పోయారన్నారు.

సంబంధిత పోస్ట్