బాధిత కుటుంబానికి రూ. 5 లక్షలు అందజేత

56చూసినవారు
పలమనేరు ఏరియాలో ఇటీవల ఏనుగుల దాడి చేయడంతో గంగప్ప చనిపోయారు. ఆయన కుటుంబానికి ప్రభుత్వం రూ. 5 లక్షలు మంజూరు చేసింది. డీఎఫ్ఓ చైతన్య కుమార్ రెడ్డి, పలమనేరు ఎమ్మెల్యే అమరనాథ రెడ్డి చేతుల మీదుగా గురువారం చెక్కు అందజేశారు. రాపిడ్ రెస్పాన్స్ వెహికిలు ఎమ్మెల్యే చేతుల మీదుగా ప్రారంభించారు. అత్యవసర సమయాల్లో సిబ్బంది వెళ్లడానికి వీటిని రూపొందించినట్లు డీఎఫ్వో తెలిపారు.

సంబంధిత పోస్ట్