టీడీపీ పలమనేరు ఎమ్మెల్యే అభ్యర్థిగా మాజీ మంత్రి అమర్నాథరెడ్డి పోటీ చేస్తున్నారు. నామినేషన్ల ప్రక్రియ మొదలు కావడంతో ఈ నెల 22న సోమవారం ఉదయం 10 గంటలకు పలమనేరు కార్యాలయంలో ఆయన నామినేషన్ వేస్తారని గురువారం మాజీ మంత్రి తెలిపారు. పలమనేరు నియోజకవర్గ ప్రజలు, టీడీపీ శ్రేణులు పాల్గొని తనని ఆశీర్వదించాలని కోరారు.