కమ్మనపల్లె గురుకుల బాలికల పాఠశాలలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నట్లు ప్రిన్సిపల్ శోభ శుక్రవారం తెలిపారు. పాఠశాలలో భౌతికశాస్త్రం, గణితం, తెలుగు పాఠ్యాంశాల బోధనకు ఉపాధ్యాయులను భర్తీ చేయనున్నట్లు చెప్పారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ నెల 15లోపు దరఖాస్తు చేసుకోవాలని కోరారు.