గంగవరం మండలంలోని మన్నారునాయన పల్లి గ్రామం వద్ద పంట పొలాల్లో ఓ నెమలి శుక్రవారం స్థానికులకు కనిపించింది. స్థానికులు వెంటనే జంతు పరిరక్షణ సమితి సభ్యులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న జంతు పరిరక్షణ సమితి అధ్యక్షుడు సందీప్ సంఘటన ప్రాంతానికి చేరుకొని, నెమలిని చేరదీశారు. అనంతరం నెమలిని అటవీ శాఖ అధికారులకు అందించారు.