కర్ణాటక నుంచి మద్యం తరలిస్తున్న ఇద్దరిని పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. పట్టణంలోని నాగమంగళం వద్ద టెట్రాప్యాకెట్లు తీసుకొస్తున్న నవీన్, రమేష్ ను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 288 ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు వీటిని బంగారుపాళ్యానికి తరలిస్తున్నట్లు సమాచారం రావడంతో పట్టుకున్నామని ఏఎస్ఐ పళణి తెలిపారు.