వ్యక్తి అదృశ్యం కేసు నమోదు

1154చూసినవారు
వ్యక్తి అదృశ్యం కేసు నమోదు
ఉపాధి కోసం వెళ్ళిన భర్త ఐదు రోజులైనా ఇంటికి తిరిగి రాకపోవడంతో అతని భార్య సోమవారం కలికిరి పోలీసులను ఆశ్రయించింది. కలికిరి మండలం గుండ్లూరుకు చెందిన పి. ముబారక్ (38) ఈ నెల 5న వాల్మీకిపురంకు కొయ్య పనికి వెళ్ళాడని, ఇంతవరకు ఇంటికి తిరిగి రాలేదు. అతని కోసం వెతికినా ఫలితం లేకపోయింది. దీంతో అతని భార్య జోహర్ జాన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు హెడ్ కానిస్టేబుల్ రఫీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :