![ఘనంగా శాఖాహార సద్భావన యాత్ర ఘనంగా శాఖాహార సద్భావన యాత్ర](https://media.getlokalapp.com/cache/0a/54/0a54402d583922637a00eccaa7605d32.webp)
ఘనంగా శాఖాహార సద్భావన యాత్ర
అన్నమయ్య జిల్లా పీలేరులో మంగళవారం శాఖాహార సద్భావన యాత్రను ఘనంగా నిర్వహించారు. కొటాల జేతవనం పిరమిడ్ సొసైటీ ఆధ్వర్యంలో పీలేరు నందు శాఖాహార ర్యాలీ శ్రీ బ్రహ్మర్షి పితామహ పత్రి మహారాజ్ ఆశీస్సులతో సుమారు 800 మంది పిరమిడ్ మాస్టర్లు పాల్గొని శాఖాహారం యొక్క విశిష్టతను, విలువలను ప్రజలకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాస్టర్ ప్రభాకర్, పలమనేరు బాలాజీ, పిప్పళ్ళ ప్రసాదరావు, గణేష్, సతీష్, తదితరులు పాల్గొన్నారు.