వరసిద్ది వినాయకస్వామి వారి సేవలో మాజీ న్యాయమూర్తి

63చూసినవారు
చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం ఐరాల మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాణిపాకం శ్రీవరసిద్ధి వినాయక స్వామివారిని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సురేంద్రగుప్తా మంగళవారం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు వారికి స్వాగతం పలికారు. దర్శనం అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలతో పాటు, చిత్రపటాన్ని బహూకరించారు. కార్యక్రమంలో ఆలయ అధికారులు, ఈవో వెంకటేశు, అర్చకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్