రోడ్డు ప్రమాదంలో రైతుకు తీవ్ర గాయాలు

5322చూసినవారు
రోడ్డు ప్రమాదంలో రైతుకు తీవ్ర గాయాలు
చిత్తూరు జిల్లా పుంగనూరు మండల పరిధిలోని చండ్రమాకుల పల్లె గ్రామానికి చెందిన రైతు భాస్కర్ (40 ) మంగళవారం గ్రామ సమీపంలో వ్యవసాయ పొలం వద్దకు వెళ్లాడు. అక్కడ పనులు చేస్తున్న కూలీలు జ్యూస్ కావాలని అడుగగా కృష్ణాపురంకు వెళ్లి జ్యూస్ తీసుకొని ద్విచక్ర వాహనంలో తిరిగి వస్తుండగా మార్గమధ్యంలో రైతును ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడ్డ బాధితున్ని 108 లో మదనపల్లె జిల్లా ఆసుపత్రికి తరలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్