రైల్వే కాలనీలో వైభవంగా నిమజ్జనం

60చూసినవారు
రేణిగుంట సీఆర్ఎస్ రైల్వే నార్త్ కాలనీలోని రామాలయంలో ప్రతిష్టించిన వినాయకుడి నిమజ్జన వేడుకలను సోమవారం సాయంత్రం వైభవంగా నిర్వహించారు. ప్రత్యేకంగా అలంకరించిన వాహనంలో స్వామిని ఊరేగించారు. భక్తులు స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. యువకులు, చిన్నారుల నృత్యాలతో ఊరేగింపు వైభవంగా కొనసాగింది. అనంతరం సమీప చెరువులో నిమజ్జనం చేశారు.

సంబంధిత పోస్ట్