వ్యవసాయ మార్కెట్ లో రూ. 750 పలికిన టమోటా

60చూసినవారు
వ్యవసాయ మార్కెట్ లో రూ. 750 పలికిన టమోటా
చిత్తూరు జిల్లా పుంగనూరు వ్యవసాయ మార్కెట్లో 15 కేజీల టమోటా ధర రూ. 750 పలికినట్లు వ్యవసాయ కమిటీ మార్కెట్ కార్యదర్శి సోమవారం తెలిపారు. ధరలు బాగా పెరుగుతూ ఉండడంతో రైతన్నలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పుంగునూరు నియోజకవర్గంలోని 6 మండలాల్లోని రైతులకు కూడా ఎక్కువ శాతం టమోటా పంటపైనే ఆధారపడి వ్యవసాయం చేస్తున్నారు. రైతులకు తమ కష్టానికి తగిన ఫలితం రావడంతో దేవుడు తమపై దయ చూపాడని తెలిపారు.

సంబంధిత పోస్ట్