కేవీబీపురం మండలం కోవనూరులో బీఎస్పీ నాయకులు ఆదివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సత్యవేడు నియోజకవర్గ నాయకుడు ధన హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ. ఏప్రిల్ 14న బాబా సాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా కేవీబీపురంలో బహిరంగ సభ ఏర్పాటు చేశామన్నారు. ఈ సభకు ప్రజలు స్వచ్ఛందంగా తరలిరావాలని కోరారు.