వైభవంగా సంతోపు గంగమ్మ తిరుణాలు

59చూసినవారు
తంబళ్లపల్లెకు సమీపంలో సంతోపు వద్ద వెలసిన కోటకొండ గంగమ్మ తిరుణాలను గ్రామస్తులు బుధవారం ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారాకనాథరెడ్డి సతీమణి కవితమ్మ గ్రామ మహిళలతో కలిసి సామూహికంగా ఊరేగింపుగా వెళ్లి అమ్మవారికి దీలు బోనాలు సమర్పించారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. అశేష సంఖ్యలో భక్తజనం అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు.

సంబంధిత పోస్ట్