టీడీపీ తంబళ్లపల్లె ఎమ్మెల్యే అభ్యర్థిగా దాసరిపల్లి జయచంద్రా రెడ్డి శుక్రవారం నామినేషన్ సమర్పించారు. టీడీపీ,జనసేన,నాయకులు,కార్య కర్తలతో కలసి ములకలచెరువు నుంచి ర్యాలీగా తంబళ్లపల్లెకు వచ్చారు. ఆర్ఓ కార్యాలయంలో నామినేషన్ పత్రాలు వేశారు. ఇక్కడ కూటమి తరఫున అభ్యర్థిని మారుస్తారని ప్రచారం జరుగుతోంది. ఇదే సమయంలో జయచంద్రా రెడ్డి నామినేషన్ వేయడం గమనార్హం. ఎఈఎస్పీ ప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు.