తిరుపతిలోని రుయా ఆసుపత్రి ఎదుట నర్సుల ఆందోళన

53చూసినవారు
తిరుపతిలోని రుయా ఆసుపత్రి ఎదుట నర్సులు సోమవారం ఆందోళన చేపట్టారు. ఓ వ్యక్తి దాడిలో కాంట్రాక్టు నర్సు తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. దాడికి పాల్పడ్డ వారిని కఠినంగా శిక్షించాలని కోరారు. నర్సులపై పని భారం అధికంగా ఉందని వాపోయారు. గాయపడిన నర్సుకు వేతనంతో కూడిన సెలవు మంజూరు చేయాలని వెల్లడించారు. వైద్య వృత్తిలో ఉన్న వారిపై దాడులు గర్హనీయమని చెప్పారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్