ప్రజా సమస్యలపై మాట్లాడుతుంటే తనను వ్యక్తిగతంగా విమర్శిస్తున్నారని పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. ‘జగన్ సతీమణి గురించి అనడానికి ఎంత సేపు పడుతుంది. పెళ్లాం అనే పదం మనం వాడుతామా? సీఎం జగన్ మరీ దిగజారి మాట్లాడుతున్నారు. సొంత చెల్లి జీవితాన్ని రోడ్డున పడేశారు. పోలవరం రాజధాని లేకుండా చేశారు. దళితులపై దాడులు, నిరంకుళ పాలన చూస్తుంటే ప్రజలకు మండదా?’ అని నిలదీశారు.