ఏపీలో అసలైన రాజకీయం మొదలైంది. వైసీపీ సోషల్ మీడియాపై కూటమి ప్రభుత్వం పంజా విసురుతోంది. వైసీపీ తరఫున ఐదేళ్ల పాటు సోషల్ మీడియాలో రెచ్చిపోయిన వారి అందరినీ లిస్ట్ ఔట్ చేసి మరీ అరెస్టులు చేస్తున్నారు. దీంతో వైసీపీ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. కోర్టులను ఆశ్రయించింది. సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్ లైన్స్ చూపిస్తోంది. ఎదురుదాడి చేస్తోంది. అయినా సరే ఈ అరెస్టులు ఎక్కడా ఆగడం లేదు. దీంతో వైసీపీ పూర్తిగా ఇబ్బందులు ఎదుర్కొంటోంది.