ఏపీ బార్ కౌన్సిల్ న్యాయవాదుల ప్రాక్టీసు ధ్రువీకరణ విషయానికి సంబంధించి సర్టిఫికేట్ ఆఫ్ ప్రాక్టీస్(సీవోపీ) దరఖాస్తులు సమర్పించే గడువును పొడిగించింది. మార్చి 15వ తేదీని తుది గడువుగా నిర్ణయించింది. సమయం పొడిగించాలని వివిధ ప్రాంత న్యాయవాదులు చేసిన విజ్ఞప్తి మేరకు నిర్ణయం తీసుకున్నట్లు బార్ కౌన్సిల్ వెల్లడించింది.