AP: కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన వైసీపీ నాయకుడు రావులకొల్లు నాగేందర్ బాబు క్రికెట్ బెట్టింగ్ వ్యవహారంలో అరెస్ట్ అయ్యాడు. అతడితో పాటు ముగ్గురిని కూడా పోలీసులు ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. అయితే ఇటీవల జరిగిన చాంపియన్షిప్ ట్రోఫీలో క్రికెట్ బెట్టింగ్ నిర్వహించినట్లు సమాచారం రావడంతో వారిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ విషయంలో మరికొంతమందిని కూడా అరెస్ట్ చేయనున్నట్లు చెప్పారు.