తైవాన్ ఎలక్ట్రానిక్స్ తయారీ దిగ్గజం ఫాక్స్కాన్ గ్రూప్ సీఈఓ, ఛైర్మన్ యాంగ్ లి కు పద్మ భూషణ్ అవార్డు దక్కింది. 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రకటించిన అవార్డుల్లో ఆయనకు దేశంలో మూడో అత్యుత్తమ పౌర పురస్కారం ప్రకటించారు. ఈసారి 17 మందికి పద్మ భూషణ్ అవార్డులను ప్రకటించిగా ఏకైక విదేశీయుడిగా యాంగ్ లి నిలిచారు. యాంగ్ నాయకత్వంలో 2019లో భారత్లో ఐఫోన్ల తయారీని ఫాక్స్కాన్ ప్రారంభించింది.