బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడిందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఇది రేపటికి వాయుగుండంగా, ఎల్లుండి తూర్పు మధ్య బంగాళాఖాతం వద్ద తుఫానుగా మారే అవకాశం ఉందని తెలిపింది. మే 26 సాయంత్రానికి బంగ్లాదేశ్& పశ్చిమబెంగాల్ తీరాలకు తీవ్ర తుఫానుగా చేరుకుంటుందని పేర్కొంది. ప్రస్తుతానికి దీని వలన ఏపీకు ఏటువంటి ముప్పులేదని వివరించింది.